బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లలో చాలా రకాల వంటకాలు ఉన్నాయి. అందులో తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకునే రాగి దోశ రెసిపీ తయారీ గూర్చి ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.
రాగి దోశ తయారీకి కావాల్సిన పదార్దాలు
- రాగిపిండి – ఒక కప్పు
- బియ్యంపిండి – అర కప్పు
- రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
- ఉప్పు – తగినంత
- పెరుగు – 2 టేబుల్ స్పూన్స్
- నీళ్లు – ఒక కప్పు
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- మిరియాల పొడి – అర టీస్పూన్
- కరివేపాకు – ఒక రెమ్మ
రాగి దోశ తయారీ విధానం
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రాగిపిండి, బియ్యంపిండి, రవ్వ, సరిపడా ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి బాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇపుడు అందులో సరిపడా నీళ్లు పోసి దోస పిండి మాదిరిగా కొద్దిగా పలచగా కలుపుకుని, దీనిని ఓ ఇరవై నిమిషాల పాటు పక్కన బెట్టుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వేసి కలపాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పై నూనె రాసి వేడి చేయాలి. పాన్ వేడయ్యాక పిండిని దోశలు మాదిరిగా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ దోశను చక్కగా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే రాగి దోశలు రెడీ అయినట్లే . లేదా ఒక వైపే కాల్చుకుని పైన ఆనియన్స్ ను స్టఫ్ చేసుకోవచ్చు.
రాగి దోశలో లభించే పోషకాలు, ప్రయోజనాలు
రాగి పిండిలో డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం మరియు ప్రొటీన్ల సంవృద్ధిగా ఉంటాయి . రాగుల పిండిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 100గ్రాకు రాగి పోషక విలువ 13గ్రా ప్రొటీన్ను అందిస్తుంది. ఇది మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది మరియు గ్యాస్ట్రిక్ ఖాళీ సమయాన్ని ఆలస్యం చేస్తుంది, తద్వారా మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించడానికి మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది రక్తంలో చక్కెర స్పైక్లను నియంత్రించడంలో మరియు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ డి కూడా ఉంది మరియు కాల్షియంతో పాటు ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాగులను తీసుకోవడం అనేది శరీరంలోని కాల్షియం స్థాయిలను కొనసాగించడానికి ఒక మంచి మార్గం మరియు బోలు ఎముకల వ్యాధిని అరికట్టవచ్చు. ఇది పిల్లలకు బలమైన ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.