నోరూరించే నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

నోరూరించే నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం : పోషకాలు

చేపల్లోని రకాన్ని బట్టి, ఇగురు చేప, పులుసు, ఫ్రై, పచ్చడి ఇలా రకరకాలుగా చేపలతో వంటలు తయారు చేసుకోవచ్చు. చేపల కూర మంచి పోషకాలును కలిగి ఉంటుంది. ఇది ప్రొటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ మరియు ఇతర పోషకాలకు మంచి మూలం.ఈ ఆర్టికల్ యందు చాలా ఈజీగా నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

నెల్లూరు చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • చేప ముక్కలు - 12
  • చింత పండు - నాలుగు బొట్టలు
  • టమోటో - మూడు
  • ఉల్లిపాయలు - రెండు
  • ఆవాలు - పావు స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • మెంతులు - ఒక టీ స్పూన్
  • జీరా - అర స్పూన్
  • ధనియాలు - రెండు స్పూన్లు
  • పసుపు - ఒక టీ స్పూన్
  • కారం పొడి - నాలు స్పూన్స్ (సరిపడా)
  • గరం మసాలా - అర స్పూన్
  • జీలకర్ర - పావు స్పూను
  • నీళ్లు - గ్రేవీకి సరిపడా
  • ఉప్పు - తగినంత
  • నూనె - ఆరు స్పూన్లు
  • చిన్న సైజు మావిడి కాయ
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం

ముందుగా చేపల ముక్కలను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. పాన్‌లో మెంతులు, ధనియాలు దోరగా వేయించుకోవాలి. వేయించిన మెంతులు, ధనియాలు చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకుని పక్కనపెట్టుకోవాలి. వండుకోటానికి  ఇరవై నిమిషాల ముందు చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తరవాత గుజ్జుతీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమోటాలను కూడా గుజ్జు చేసుకోవాలి.

పైన చెప్పిన విధంగా అన్ని సిద్ధం చేసుకున్నాక, చింతపండు గుజ్జులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత చింతపండు రసంలో సరిపడా కారంపొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీరా, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ముందుగా రుబ్బుకున్న టమోటో గుజ్జు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూడు నిముషాలు మగ్గనివ్వాలి.

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసును పాన్‌లో వేసి మరో రెండు నిముషాలు మరగబెట్టాలి. తరవాత అందులో శుభ్రం చేసిన చేపల ముక్కలు, మీ పులుపుకి సరిపడా మామిడి ముక్కల తురుము, ముందుగా సిద్ధం చేసుకున్న మెంతులు ధనియాల పొడిని, గరం మసాలా పులుసులో వేసి పదిహేను నిముషాల పాటు తక్కువ ఫ్లేమ్ పై ఉంచితే చేపల పులుసు సిద్ధమవుతోంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.

చేపలలో లభించే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డి మరియు బి2 (రిబోఫ్లావిన్) వంటి విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి . చేపలో కాల్షియం మరియు ఫాస్పరస్ మరియు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగం. అవి ప్రోటీన్ మరియు విటమిన్ల యొక్క మంచి మూలాన్ని అందిస్తాయి మరియు గుండె-ఆరోగ్యకరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల యొక్క ప్రాధమిక ఆహార వనరు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సాల్మన్, క్యాట్ ఫిష్, టిలాపియా, ఎండ్రకాయలు మరియు స్కాలోప్స్ వంటి ఈ వర్గంలోని చేపలు మరియు షెల్ఫిష్‌లు వారానికి రెండు నుండి మూడు సార్లు లేదా వారానికి 8 నుండి 12 ఔన్సులు తినడం సురక్షితం.

Post Comment